telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ కార్యకర్త పై వైసీపీ గూండాలే దాడిచేశారు: కేశినేని నాని

kesineni nani tdp

ఏపీలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు పరస్పసర దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట టీడీపీ కార్యకర్త సలీమ్ పై ఇటీవల నలుగురు ప్రత్యర్థులు కత్తులతో దాడిచేశారు. ఈ దాడిలో సలీమ్ తీవ్రంగా గాయపడి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. బాధితున్ని విజయవాడ లోక్ సభ సభ్యుడు, టీడీపీ నేత కేశినేని నాని పరామర్శించారు.

ఈ ఘటనకు సంబంధించి రమణ, గోపి, పార్థసారథి, మరొకరిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే దాడిచేసిన వారంతా వైసీపీ శ్రేణులేనని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ తాతయ్యగారితో కలిసి కేశినేని సలీమ్ ను ఈ మేరకు ట్వీట్ చేసిన కేశినేని,  ఈ దాడి ఘటనకు సంబంధించిన వార్తా పత్రికల కథనాలను పోస్ట్ చేశారు.

Related posts