ఏపీ లో ఇసుక కొరతకు నిరసనగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు జనసేన నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో విశాఖలో లాంగ్ మార్చ్ ర్యాలీ ప్రారంభం కానుంది.
లాంగ్ మార్చ్ లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా లాంగ్ మార్చ్ జరిగే మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కార్మికులు, జనసేన నేతలు, కార్యకర్తల వాహనాలకు ఆళ్వార్ దాస్ ఇంజినీరింగ్ కాలేజి పీఏ పాలెం క్యాంపస్ లో పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు జనసేన ఓ ప్రకటనలో వెల్లడించింది.
బ్రిటన్ లో రావుల్ విన్సీ..ఇండియాలో రాహుల్ గాంధీ: యోగి