telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సిబిఐ విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి!

ys vivekananda reddy

కడప జిల్లా : వైఎస్ వివేకా హత్య కేసులో పదో రోజు సిబిఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో కొనసాగుతున్న సీబీఐ విచారణ…తాజాగా ముగ్గురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు…చిట్వేలి మండలానికి చెందిన వైకాపా కార్యకర్తలు లక్ష్మీ రంగా, రమణను ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. వారితో పాటు సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.గతంలో వివేకా దగ్గర పీఏగా జగదీశ్వర్ రెడ్డి పనిచేశారు. కాగా సీబీఐ దర్యాప్తు నేపధ్యంలో…వైఎస్ వివేకా కూతురు… తన ఇంటి దగ్గర అదనపు భద్రత ఏర్పాటు చేయాలనీ పోలీసులను కోరింది.

Related posts