telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొన్ని చానళ్లు అమ్ముడు పోయాయి: జగన్

YS Jagan Files Nomination Pulivendul

ఏపీ సీఎం చంద్రబాబు పై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు రోడ్ షోలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు చేయని కుట్రంటూ ఉండదని ఆరోపించారు. గెలుపు కోసం అన్ని రకాలుగా మోసాలకు తెరలేపుతారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో తమ పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదని, అమ్ముడు పోయిన మీడియాతో కూడా పోరాడాల్సి వస్తోందని అన్నారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9 మీడియా సంస్థలన్నింటితో తాము పోరాడక తప్పని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. కుట్రలతో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తుంటే, కొన్ని పత్రికలు, చానళ్లు అమ్ముడుపోయాయని జగన్ ఆరోపించారు. ఇలాంటి కుట్రలను దీటుగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.

Related posts