తిరుపతి విమానాశ్రయం త్వరలో కొత్త హంగులతో రూపుదిద్దుకోనుంది. సరికొత్త వీఐపీ లాంజ్ ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భేటీ అయిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుపతి ఎయిర్ పోర్టు రూపురేఖలు మారనున్నాయి.
ఎయిర్ పోర్టు అథారిటీకి చెందిన 1800 చదరపు మీటర్ల భూమిని కూడా ఏపీ విద్య,సంక్షేమ అభివృద్ధికి కార్పొరేషన్ కు కేటాయించేందుకు కేబినెట్ అంగీకరించింది. ఈ భూమిలోనే వీఐపీ లాంజ్ నిర్మాణం చేయనున్నారు. ఈ భూమిని ఏడాదికి రూపాయి లైసెన్స్ ఫీజుతో 15 ఏళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించింది.