telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్రబాబుకు మానసిక స్థితి బాగోలేదు..కుప్పానికి వచ్చిన ప్రతీసారి బ్లాక్ డే..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుప్పానికి వచ్చిన ప్రతీసారి బ్లాక్ డే అంటున్నార‌ని మండిప‌డ్డారు.

తిరుపతిలోని పెద్దిరెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ..మూడేళ్ళలో కుప్పంకు కేవలం 6 సార్లు మాత్రమే చంద్రబాబు వచ్చారని పేర్కొన్న పెద్దిరెడ్డి.. 30 సంవత్సరాల్లో కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్థిని శూన్యం అన్నారు. కుప్పంలో పెండింగ్ లో ఉన్న తాగు – సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.

చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే 7 వేల ఇళ్లను నిర్మించి ఇచ్చిందని, త్వరలో మరో 3 వేల ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పంలో పేదల కోసం కనీసం ఒక్కరికైనా ఇల్లు కట్టించి ఇచ్చారా..? అని చంద్రబాబును మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబుకు మానసిక స్థితి బాగోలేదని , చంద్రబాబును వెంటనే కుటుంబ సభ్యులు వైద్యుడికి చూపించాల‌ని విమర్శించారు. కుప్పంలో ఇక గెలవలేమనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు

కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేలా టీడీపీ ప్లాన్ చేసిందని.. మూడు రోజుల చంద్రబాబు పర్యటనలో అధికంగా గాయపడింది వైసీపీ కార్యకర్తలేనని.. బయటి వ్యక్తులను తీసుకొచ్చి మా పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కుప్పం ప్రజలు చంద్రబాబును ఎప్పుడో వదిలేశారని అన్నారు. ఎన్నికలలోపే కుప్పం బ్రాంచ్ కెనాల్‌ పూర్తి చేస్తామని చెప్పారు.

Related posts