ప్రముఖ సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఏషియన్ ఫిలింస్ అధినేత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.
ఏషియన్ మల్టీప్లెక్స్, ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్న నారాయణ దాస్ కె.నారంగ్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అనే బ్యానర్ను స్టార్ట్ చేశారు. ఇటీవల నాగచైతన్య ‘లవ్స్టోరీ’,నాగశౌర్యతో ‘లక్ష్య’ సినిమాలను నిర్మించారు.
ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’, ‘ఘోస్ట్’, ధనుష్తో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలే. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మూవీ ఫైనాన్షియర్ గా చిత్ర పరిశ్రమకు నారాయణ దా కె నారంగ్ ఎనలేని సేవలను అందించారు .
నారాయణ దాస్ మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.