తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించినప్పటికీ యాజమాన్యం విధుల్లోకి తీసుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిపోల మందు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న రాజేందర్ (55) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు రాజేందర్ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రాజేందర్ మృతిచెందాడు. రాజేందర్ది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పాడ్ గ్రామం. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.