telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మొదటి కృష్ణుడు కేసీఆర్, రెండో కృష్ణుడు కేటీఆర్: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై టీ-కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మాయమాటలతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ పై మండిపడ్డారు. మొదటి కృష్ణుడు కేసీఆర్, రెండో కృష్ణుడు కేటీఆర్ అని రేవంత్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ మాటలు చెబుతున్నారని, కేటీఆర్ ఏమో తన సమర్ధవంతమైన పరిపాలన చూసి ఓట్లు వేయాలని అడుగుతున్నారని ధ్వజమెత్తారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పావనిని అడిగితే కేటీఆర్ సమర్ధత ఏపాటిదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు మొహం చెల్లకపోవడంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ ను తెరపైకి తెచ్చారని విమర్శించారు.ఏ మునిసిపాలిటీలో అయినా మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజాకోర్టు నిర్వహించేందుకు కేటీఆర్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.

Related posts