ఏపీలోని అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీ కొట్టింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. ఇందులో ఇద్దరు యువతులు, మరో ఇద్దరు యువకులు ఉన్నారు. కారు.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకం చర్యలు చేపట్టారు. మృతులు రేఖ, అంచల్ సింగ్, మహబూబ్ అలం, మిట్టల్ ఉన్నారు. మృతుల్లో ఒకరిది స్వస్థలం బెంగళూరు కాగా మరో ముగ్గురు ఢిల్లీకి చెందిన వారని సమాచారం. వీరంతా కర్ణాటకలోని యశ్వంత్పూర్ నుంచి వస్తున్నట్లు తెలిసింది. వీరు ప్రయాణిస్తున్న కారు.. కియా పరిశ్రమ ప్రధాన గేటు వద్దకు రాగానే.. స్వీడ్ బ్రేకర్ వద్ద స్లో అయిన లారీని కారు వేగంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post
“బాహుబలి”కి ముందు “శివ”…: ప్రభాస్