ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 150 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 25న తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.
పలువురు ప్రముఖులు వైఎస్ జగన్కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శారదాపీఠాధిపతితో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడి ఆశీస్సులు తీసుకున్నారని సమాచారం. స్వామి సూచన మేరకు మే 30న ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు టీడీపీ 24 స్థానాల్లో లీడ్లో ఉంది. జనసేన సింగిల్ సీటులోనే లీడ్లో ఉంది. ఇదిలా ఉంటే.. మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 23 స్థానాల్లో లీడ్లో ఉండగా.. టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది.