telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జేపీ నడ్డా వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌ రావు

Harish Rao trs

కరోనా పరీక్షల విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు ఖండించారు. కరోనా విషయంలో రాజకీయాలు చేయాలని చూడటం దారుణమని అన్నారు. వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా జేపీ నడ్డా మాట్లాడారని హరీశ్‌రావు ట్విటర్లో పేర్కొన్నారు.

కరోనా విషయంలో రాజకీయాలు చేయడం దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లడడంతో సమానం. దయచేసి ఇది గుర్తుంచుకోవాలని జేపీ నడ్డాను కోరుతున్నా. సైనికుల నైతికస్థైర్యం దెబ్బతీస్తుందని ఉద్బోదిస్తారు. మరి కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా? అని హరీశ్‌ రావు ప్రశ్నించారు.

‘సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులు, ప్రాణాలను లెక్క చేయకుండా కరోనాపై పోరాడుతున్న వైద్యులు ఒక్కటే అని కదా మనం అనుకుంటున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా అదే కదా చెప్తున్నారు. దేశ రక్షణ విషంలో ప్రభుత్వాలపై విమర్శలు చేయడం అనుచితం కాదని మీరే అంటారు’ అంటూ హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

Related posts