ఇక దేశవ్యాప్తంగాబీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పూర్తి ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మెజార్టీ మార్క్ను దాటి 330కి పైగా స్థానంలో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీతొలి విజయాన్ని నమోదు చేసింది. దమన్ దయ్యూ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లాలూభాయ్ పటేల్.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేతన్ పటేల్పై గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీనే గెలుపొందింది. గత ఎన్నికల్లో కేతన్ పటేల్పై లాలూభాయ్ పటేల్ 9000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కేరళలో మాత్రం బీజేపీ వెనుకంజలో ఉంది. అక్కడ యూడీఎఫ్ కూటమి పూర్తి మెజారిటీ దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం యూడీఎఫ్ 19కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ ఇప్పటి వరకు ఒక్క స్థానంలో కూడా ఖాతా తెరవలేదు. ఎల్డీఎఫ్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.
బలహీనవర్గాల గొంతు నొక్కేందుకే కౌన్సిల్ రద్దు తీర్మానం: చంద్రబాబు