ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ విజయం బాటలో దూసుకుపోతుంది. ఇప్పటికే వైసీపీ 150 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ కేవలం 24 స్థానాల ఆధిక్యంలో ఉంది. దీంతో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం అయిపోయింది. ఈనేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అద్భుత విజయం సాధించినందుకు కేసీఆర్.. జగన్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
జగన్కి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ అభినందనలు:
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైసీపీ అధినేత జగన్కి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. సోదర రాష్ట్రానికి మంచి జరగాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల సరళిపై కేటీఆర్ మాట్లాడుతూ, ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించారు. ప్రజల దీవెనల రూపంలో జగన్ కష్టం ఫలించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలనను సమర్థంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
అమిత్ షా టీడీపీకి తలుపులు మూసేశారు: కన్నా