కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తాను పాల్గొన్నానని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రతికూలత గొప్ప అవకాశాలను అందిస్తుందన్న తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచానని చెప్పారు.
‘కరోనా’ బారి నుంచి బయటపడే ప్రపంచానికి సాంకేతిక పరిష్కారాలను త్వరగా అభివృద్ధి చేసే సత్తా భారతదేశానికి ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని చెబుతూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.