telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : కోహ్లీసేన టార్గెట్ ఎంతంటే..?

ఐపీఎల్ 2021 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన ప్రభాసిమ్రాన్ సింగ్ (7) తర్వగా ఔట్ అయ్యి అందరిని నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గేల్(46) రెచ్చిపోయాడు. కానీ గేల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన వారు నిరాశపరిచారు. కానీ ఆ జట్టు కెప్టెన్ రాహుల్ 91 పరుగులు చేసి చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. అతనికి తోడుగా హర్‌ప్రీత్ బ్రార్ (25) చివరిని బంతిని సిక్స్ గా మలచడంతో పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఇక బెంగళూరు బౌలర్లలో కైల్ జామిసన్ రెండు వికెట్లు తీయగా షాబాజ్ అహ్మద్, డేనియల్ సామ్స్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీసేన గెలవాలంటే 180 పరుగులు చేయాలి. కానీ ఈ లక్ష్యం బెంగళూరుకు పెద్దది కాదు అని ప్రస్తుతం ఆ జట్టు ఉన్న ఊపును చూస్తే అర్ధం అవుతుంది. మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది చూడాలి.

Related posts