విజయవాడలో దళిత యువకుడి లాకప్ డెత్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ నుంచి ఆర్టీసీ కార్గో వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలను గత నెల 17న విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్టీసీ కార్గో వాహనం నుంచి మొత్తం 28 అట్టపెట్టెలను స్వాధీనం చేసుకున్న పోలీసులు గుప్తా ఫోన్ నంబరు, కాల్ డేటా ఆధారంగా కృష్ణలంక పెద్దవారి వీధికి చెందిన కారు డ్రైవర్ అయిన డి.అజయ్ (26) మారుపేరుతో మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్నట్టు గుర్తించారు. దీనిపై విజయవాడ పటమట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అజయ్, మొగల్రాజపురానికి చెందిన అతడి స్నేహితుడు సాయికిరణ్లను నిన్న మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎస్ఈబీ కార్యాలయం నుంచి వారిని పటమట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న సమయంలో తనకు ఛాతీలో నొప్పిగా ఉందని, ఊపిరి ఆడడం లేదని, ఒళ్లు చల్లబడుతోందని పోలీసులకు చెప్పాడు. దీంతో వెంటనే అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అజయ్ మృతిపై స్పందించిన పోలీసులు.. అతడు అనారోగ్య కారణాలతో మృతి చెందాడని, లాక్డెత్ కాదని స్పష్టం చేశారు.
చేపపిల్లలను వదిలిన మంత్రి జగదీష్ రెడ్డి…