telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ నేతల షాపులు ధ్వంసం

ycp letter to CS on praja vedika building

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని గుడిపూడిలో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతల దుకాణాలు, ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేశారు. నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గుడిపూడిలో నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని టీడీపీ నేతల ఇళ్లు ఉన్న వీధి నుంచి వైసీపీ నేతలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి.

టీడీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లు, షాపులు లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి.ఈ ఘటనపై టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు మద్యం సీసాలతో తమ ఇళ్లపై దాడిచేశారని ఆరోపించారు. ఇదే మార్గంలో ఉన్న తమ షాపుల అద్దాలను సైతం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు గాయలయ్యాయని తెలిపారు.

Related posts