ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు నవీన్ పోలిసెట్టి. తన తొలిసినిమాతోనే అందరికి తన ప్రతిభను కనబరిచాడు. ప్రస్తుతం నవీన్ మరో సినిమా చేశాడు. దాని పేరు ‘జాతిరత్నాలు’. మొదటి సినిమాలో తప్పు చేసిన వారిని పట్టించే డిటెక్టివ్గా కనిపించిన నవీన్ ఈ సినిమాలో తానే ఓ దొంగగా కనిపించాడు. ఈ సినిమాలో జోగిపేట శ్రీకాంత్ అనే పాత్రలో నవీన్ కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా నుండి ఇంతకముందుకు విడుదలైన జాతిరాత్నాలు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుండి ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చితబృందం ప్రకటించింది. రేపు సాయంత్రం 4:20 గంటలకు జాతిరత్నాలు ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేనున్నాడు. అయితే ‘మహానటి’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ నిర్మాతగా మారారు. స్వప్న సినిమాతో కలిసి,ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రధన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది.. అభిమానులను ఆకట్టుకుంటుందా.. లేదా అనేది.
previous post
next post
వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుంది: జేసీ దివాకర్ రెడ్డి