నేను శైలజ సినిమా తెలుగు చిత్రపరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కీర్తిసురేష్.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అఖిలాంధ్ర ప్రేక్షకుల చేత నీరాజనాలందుకుంది. ఈ మూవీతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కించుకుంది.
దీంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో కీర్తి సురేష్కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ‘నేను లోకల్’, ‘అజ్ఞాతవాసి’, ‘మన్మథుడు 2’, ‘రంగ్ దే’ సహా పలు చిత్రాల్లో నటించింది. అతి తక్కువ సమయంలోనే తన నటనతో.. అందంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా.. దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా కొనసాగుతుంది కీర్తి.
ప్రస్తుతం ‘అన్నాత్తే’, ‘సానీ కాదియమ్’, ‘సర్కారు వారి పాట’, ‘భోళా శంకర్’, ‘దసరా’ సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.నేడు(అక్టోబర్ 17) ఈ ముద్దుగుమ్మ పుట్టనరోజు. కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు. మేనక అప్పట్లో చిరంజీవి ‘పున్నమినాగు’లో నాయికగా నటించారు. కీర్తి సురేశ్ తండ్రి సురేశ్ కుమార్ మళయాళ చిత్ర దర్శకుడు. మేనక, సురేశ్ కుమార్ దంపతులకు 1992 అక్టోబర్ 17న కీర్తి సురేశ్ జన్మించింది.
ఈ సందర్భంగా.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల నుంచి వరుసగా సర్ ప్రైజింగ్ పోస్టర్స్ సర్కారు వారి పాట , భోళా శంకర్ చిత్రాలలో కీర్తి లుక్కి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు చిత్రయూనిట్ . ఇవి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.