telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుంది: జేసీ దివాకర్ రెడ్డి

jc-diwakar-reddy

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందన్నారు. ఏసు ప్రభు చెప్పినా వినే పరిస్థితిలో జగన్ లేడని అన్నారు.

జగన్‌ను కంట్రోల్‌లో పెట్టడం ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమవుతుందని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమకు కోర్టు తప్ప వేరే మార్గం లేదని ఆయన చెప్పారు. జేసీ అస్మిత్ రెడ్డికి ఈ వ్యవహారానికి సంబంధమే లేదన్నారు. ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు నడుములు విరిగిపోయి వారు ఏమీ చేయలేక పోతున్నారని దివాకర్ రెడ్డి అన్నారు. నన్ను అరెస్ట్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడి అరెస్టుపై తాను ఏమీ మాట్లాడబోనన్నారు.

Related posts