telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వైద్యులకు అరుదైన గౌరవం..భారత వాయు సేన పూల వర్షం

gandhi hospital flowers

కరోనా పోరాట యోధులకు దేశ వ్యాప్తంగా అరుదైన గౌరవం దక్కింది. వారికి సంఘీభావంగా త్రివిధ దళాలు నేడు వందన సమర్పణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిపై భారత వాయు సేన పూల వర్షం కురిపించింది. ఆస్పత్రి ఆవరణలోని ప్రొ.జయశంకర్‌ విగ్రహం వద్ద వైద్య సిబ్బంది భౌతికదూరాన్ని పాటిస్తూ నిలుచున్నారు. హైదరాబాద్‌ సీపీతో పాటు ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు గాంధీ ఆస్పత్రి వద్ద క్యూలో నిల్చున్నారు. వీరి సేవలకు సంఘీభావంగా ఐఏఎఫ్ హెలికాఫ్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో నిలిపి ఉంచిన నౌకలకు నేడు విద్యుత్‌ దీపాలంకరణ చేయనున్నారు. అలాగే, ముంబై, చెన్నై, కొచ్చిలోని నౌకలకు కూడా దీపాలంకరణ చేస్తారు. విశాఖలో వైద్యులను కలిసిన నౌకాదళ అధికారులు వారికి అభినందనలు తెలిపారు. ఛాతీ ఆసుపత్రితో పాటు వైద్యులపై నావికాదళ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. 

 

Related posts