telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మధ్యప్రదేశ్ లో మరో బాదుడు.. పెట్రోలుపై కరోనా ట్యాక్స్!

petrol bunk

కరోనా సంక్షోభంతో గత వారం రోజులుగా పెట్రో ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్‌పై కరోనా ట్యాక్స్ పేరుతో వాహనదారుల నెత్తిన మరో బండ వేసింది.

పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూపాయి చొప్పున కరోనా ట్యాక్స్ విధించిన ప్రభుత్వం ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది. కరోనా ట్యాక్స్‌తో కలుపుకుని రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరు రూ. 82.64కు పెరగ్గా, డీజిల్ ధర రూ. 73.14కు చేరుకుంది.

Related posts