telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మోడీకి బహిరంగ లేఖ రాసిన ప్రముఖులపై కేసు నమోదు

New couples attack SR Nagar

ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై బీహార్‌లో కేసు నమోదైంది. ఈ జాబితాలో చరిత్రకారుడు రామచంద్ర గుహ, సినీ ప్రముఖులు మణిరత్నం, రేవతి, అపర్ణాసేన్ తదితరులు ఉన్నారు. చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు ముజఫర్పూర్ పోలీసులు తెలిపారు.

సమాజంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. న్యాయవాది సుధీర్ ఓజా స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా లేఖలో సంతకాలు చేసిన అందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ మెజిస్ట్రేజ్ ఆదేశాలు జారీ చేశారు. మూకదాడులకు పాల్పడడం, దాడుల సందర్భంగా జైశ్రీరామ్ నినాదాన్ని వినియోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 49 మంది ప్రముఖులు ఈ ఏడాది జులైలో ప్రధానికి లేఖ రాశారు.

Related posts