telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక్క మంచి పని చెప్పమనండి : హరీష్ రావు

Harish Rao TRS

రైతు బాగుపడితే దేశం బాగుపడుతోంది అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఊర్లు విడిచి వెళ్లిన ‌వారు తిరిగి గ్రామాలను తిరిగి వస్తున్నారు. సాగు నీరు రోడ్ నెట్ వర్క్,  ఇంటర్నెట్ సౌకర్భ, కోతలు లేని విద్యుత్ ఇస్తున్నాం.‌అందుకే‌ గ్రామాలకు తిరిగి వస్తున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ‌దేశానికి రోల్ మోడల్ ‌గా నిలిచింది. బీజేపీ వాళ్లు చాలా బాగా మాట్లాడుతున్నారు ఐటీఐఆర్ మా వల్ల రాలేదని చెబుతున్నారు. మోన్న బడ్టెట్ లో‌ 2.50 లక్షల ఎరువులు‌ సబ్సిడీ కోత విధించారు. అలాగే గ్యాస్‌సబ్సిడీ లో కోత. బీజేపీ వల్ల రాష్ట్రానికి బడ్జెట్ లో‌కోతలు, ప్రజలకు వాతలే‌ మిగిలింది అని పేర్కొన్నారు. ఎన్నికలు‌ ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లకు మెట్రో విస్తరణకు అవకాశం ఇచ్చారు. కర్ణాటక లోను మెట్రో విస్తరణకు ఆమోదం‌తెలిపారు‌. గుజరాత్ కు బుల్లెట్‌ట్రైన్ ఇచ్చారు. తెలంగాణ కు మాత్రం మొండి‌ చేయి చూపారు. మనం కట్టే పన్నుల్లో‌ 50 శాతం కూడా తిరిగి మనకు రావడం లేదు. ప్రగతి సాధించే మన రాష్ట్రం‌కన్నా వెనుకబడిన బీహార్ వంటి‌రాష్ట్రాలకు బడ్జెట్ లో ఎక్కువ నిధులు ఇచ్చారు‌. మనకు మూడు‌వేల కోట్లు డెవల్యూషన్ తగ్గించారు. మనకు విభజన చట్టంలో‌ పేర్కోన్న  బయ్యారం ఉక్కు , రైల్వే‌కోచ్ ఫ్యాక్టరీ వంటి వి ఇస్తామని ఇవ్వలేదు. ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఎమ్మెల్సీ ఏం‌ చేశారు. ఒక్క మంచి పని చెప్పమనండి. ఆరేళ్లలో 12  కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చారా… బీఎస్ఎన్ఎల్ లో‌  5౦ శాతం   మందిని ఉద్యోగులను తొలగించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు.  తెలంగాణ లో‌కూడా బీహెచ్ఈఎల్, బీడిఎల్ వంటి వాటిని ప్రయివేటు‌పరం చేస్తారు. ఉద్యోగులు ఆలోచించాలి అని అన్నారు.

Related posts