telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ రోడ్లపై తిరిగి కష్టపడ్డాడు.. తాను కూడా తిరిగేందుకు సిద్ధం: పవన్ కల్యాణ్

Pawan-Kalyan

ఏపీ సీఎం జగన్ వై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో  ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పై కేసులు లేకపోతే, ఆయన తిరిగే వారు కాదని, కూర్చునే రాజకీయం చేసేవారని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ను సీఎం చేయాలని నాడు ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుకున్నారని చెప్పారు. అలా జరగలేదు కాబట్టి జగన్ రోడ్లపై తిరగబడి కష్టపడ్డారని, ఆ కష్టాన్ని తానేమీ కాదనడం లేదని అన్నారు.

తాను కూడా రోడ్లపై తిరిగేందుకు సిద్ధంగా ఉన్నాను కానీ అభిమానులు నన్ను తిరగినిస్తారా? అని ప్రశ్నించారు. తన చొక్కానే కాదు, తన శరీరాన్నీ ముక్కలు ముక్కలుగా అభిమానులు పీక్కుపోతారని వ్యాఖ్యానించారు. వచ్చే ప్రజలను, అభిమానులను అదుపు చేయలేక తన సెక్యూరిటీ అలసిపోతారని అన్నారు. రోడ్లపైకి నేను రావాలంటే ఇన్ని ఆలోచించాలని తెలిపారు. అయినపట్టికీ నేను రాకుండా ఉండలేనని స్పష్టం చేశారు.

Related posts