తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. తొలుత ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించారు. ఇందులో టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సికింద్రాబాద్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
తొలి రౌండ్లో 1,086 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. అయితే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి నామా నాగేశ్వర్రావు బరిలోకి దిగారు.
చంద్రబాబు తనిఖీపై హంగామా అవసరం లేదు: మంత్రి బొత్స