చంద్రబాబు పర్యటన దృష్ట్యా రేణుగుంట ఎయిర్ పోర్టులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గంటసేపుగా చంద్రబాబు ఎయిర్ పోర్టులోనే నిరీక్షిస్తున్నారు. లాంజ్ నుంచి బయటకు వెళ్లనియకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. చంద్రబాబు ఎయిర్ పోర్టులోనే బైఠాయించారు. కలెక్టర్, ఎస్పీని కలవడానికి తాను వెళతానంటున్నా.. వెళ్లనివ్వకపోవడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. వాళ్లను ఇక్కడికే పిలిపిస్తామని పోలీసులు చెప్పగా.. తానేం అంత గొప్ప వ్యక్తిని కాదని.. తనకు తానుగా అక్కడికి వెళతానని చంద్రబాబు అన్నారు. తానేమీ హత్య చేయడానికి వెళ్లటం లేదని.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యక్తిని అని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే హక్కు లేదా ? అని నిలదీశారు.
next post