కొద్ది కాలం క్రితం కర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రులకే చెమటలు పట్టించింది ఆమె. ఆమె ఎవరో కాదు, రోహిణీ సింధూరి, ఓ మహిళా ఐఏయస్ అధికారి. ప్రభుత్వ మీదే న్యాయ పోరాటం చేసింది. చట్టానికి చుట్టాలుండరని నమ్మ టమే కాదు..ఆచరణలో చూపించిన అధికారి. అటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.
ఈ మేరకు కర్నాటకతో సంప్రదింపులు జరపటం, వాళ్లు అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. మరో నాలుగైదు రోజుల్లో నే ఈ డైనమిక్ అధికారి ఏపీ ముఖ్యమంత్రి టీంలో అధికారిగా చేరబోతున్నారు. ప్రజలతో మమేకం అయ్యే ఈ అధికారి కి ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న, “స్పందన” పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారట!!