telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగన్ టీం లో .. కర్ణాటక ఐఏఎస్ .. అధికారిని.. రోహిణీ సింధూరి..

karnataka dynamic ias into jagan team

కొద్ది కాలం క్రితం కర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రులకే చెమటలు పట్టించింది ఆమె. ఆమె ఎవరో కాదు, రోహిణీ సింధూరి, ఓ మహిళా ఐఏయస్ అధికారి. ప్రభుత్వ మీదే న్యాయ పోరాటం చేసింది. చట్టానికి చుట్టాలుండరని నమ్మ టమే కాదు..ఆచరణలో చూపించిన అధికారి. అటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.

ఈ మేరకు కర్నాటకతో సంప్రదింపులు జరపటం, వాళ్లు అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. మరో నాలుగైదు రోజుల్లో నే ఈ డైనమిక్ అధికారి ఏపీ ముఖ్యమంత్రి టీంలో అధికారిగా చేరబోతున్నారు. ప్రజలతో మమేకం అయ్యే ఈ అధికారి కి ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న, “స్పందన” పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారట!!

Related posts