telugu navyamedia
రాజకీయ

ఇండియా కరోనా అప్డేట్‌

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 30,773 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 3,34,48,163కి చేరింది. అలాగే, నిన్న 38,945 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు అని పేర్కొంది. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 309 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,44,838కి పెరిగింది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,26,71,167 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,32,158 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 85,42,732 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 80,43,72,331 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

Related posts