కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ మంత్రి జగదీష్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్- విజయవాడ రహదారిపై సర్వీస్ రోడ్ల నిర్మాణం, అండర్ పాస్ బ్రిడ్జిలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్-65 హైదరాబాద్- విజయవాడ రహదారిపై సర్వీస్ రోడ్స్, అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని కోరినట్లు జగదీష్రెడ్డి తెలిపారు.
ఎన్హెచ్-365 సూర్యాపేట-జనగామ రహదారిపై నాగారం, తిరుమలగిరి గ్రామాల మధ్య డ్రైన్స్తో పాటు ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అనేక పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. రహదారుల అభివృద్ధికి కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరినట్లు జగదీష్రెడ్డి వివరించారు. మంత్రి వెంట ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్రెడ్డి ఉన్నారు.