బీసీ సంక్షేమ శాఖ అధికారులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జ్యోతిరావు ఫూలే వర్థంతి వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని అంటూ హెచ్చరించారు.
“ఇది కూడా మేము మీకు చెప్పాలా ప్రత్యేకించి? హా… అంబేద్కర్ నీ, ఫూలేనీ… వీళ్లందరి గురించి మీకు ప్రత్యేకించి చెప్పాలా? స్టాపిట్. ఇంకొక్కసారి ఇలా జరిగితే స్పాట్ లో కొట్టేస్తాను. ఏమనుకుంటున్నారు మీరు? మళ్లీ మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకూడదు. తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత: నాదెండ్ల భాస్కరరావు