మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఏపీ అసెంబ్లీ ఎన్నికల పై విశ్లేషించారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కులపక్షపాతిగా వ్యవహరించారన్న ప్రచారం ప్రజల్లో బాగా ఉందని అన్నారు. జగన్ సీఎం అవడానికి కారణం ప్రజల్లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతేనని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఎలా గెలిచాడో అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వమే అబద్ధాలు చెబితే ప్రజలు ఇంకెవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మీ అభిప్రాయమేంటని నాదెండ్ల భాస్కరరావును ప్రశ్నించగా, పవన్ ని తానెప్పుడూ చూడలేదని, తననెప్పుడూ ఆయన చూడలేదని అన్నారు.
బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు