telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

తహసీల్దార్ ముందే వీఆర్వోల బాహా బాహీ!

flood water reached kurnool transport issues

కర్నూలులో రెవెన్యూ ఉద్యోగులు ఆఫీసులోనే బాహాబాహీకి దిగారు. తహసీల్దార్ కార్యాలయంలో వేణుగోపాల్ రెడ్డి, కృష్ణదేవరాయ అనే ఇద్దరు వీఆర్వోలు ముష్టి యుద్ధానికి దిగారు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తులైన ఇరువురు తహసీల్దార్ కళ్లముందే కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వీఆర్వోలకు గాయాలయ్యాయి.

వేణుగోపాల్ రెడ్డి చెవిని కృష్ణదేవరాయ కొరికాడు. కృష్ణదేవరాయ జోహరాపురం వీఆర్వోగా పనిచేస్తుండగా, వేణుగోపాల్ రెడ్డి సుంకేసుల వీఆర్వోగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరికి రాజీ కుదిర్చేందుకు రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Related posts