పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటేయడంపై బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడారు. మతోన్మాద మజ్లిస్కు భయపడే పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటేసిందని విమర్శించారు.
పౌరసత్వ సవరణ చట్టంపై అందరూ కలిసి దేశంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్, వామపక్షాలు, అర్బన్ నక్సలైట్లు, టీఆర్ఎస్ ఆలోచనా రహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేవలం 12 శాతం ఓట్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒవైసీకి మద్దతు పలుకుతున్నారని రాంచందర్రావు పేర్కొన్నారు.