గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో బాలికపై అత్యచారయత్నం జరిగిన ఘటనపై ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి, కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అత్యచార ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తాయని, పునారావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయనఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. లైంగిక దాడి జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశాం. చట్టపరంగా చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించాం. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. ప్రభుత్వం తరపున బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.