telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

అమెరికా బోటులో అగ్నిప్రమాదం.. 34 మంది ప్రయాణికుల గల్లంతు!

fire accident bldg

అమెరికా బోటులో అగ్నిప్రమాదం.. 34 మంది ప్రయాణికుల గల్లంతు!

అమెరికాలోని ఓ పడవలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కాలిఫోర్నియా రాష్ట్రం తీరంలోని శాంతా క్లాజ్ ద్వీపానికి సమీపంలో ఓ బోటులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, అత్యవసర సేవల విభాగం అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు.

దీంతో బోటు సముద్రంలోకి మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఐదుగురు సిబ్బందితో పాటు 34 మంది ప్రయాణికులు బోటులో ఉన్నారు. వీరిలో ఐదుగురు సిబ్బందిని హెలికాప్టర్ల సాయంతో అధికారులు రక్షించారు. కాగా, గల్లంతైన 34 మంది కోసం అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది గాలింపును కొనసాగిస్తున్నారు.

Related posts