telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సైబరాబాద్ ఐటీ కారిడార్‌ కు .. రెండు బస్సులు 24 ట్రిప్పులు..

bus service to saidabad IT corridor

సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులతో కలిసి ఐటీ కారిడార్‌లో ఉద్యోగుల కోసం రెండు ఆర్టీసీ బస్సు సర్వీసుల సేవలను ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసులు కోకాపేట్ నుంచి పటాన్‌చెరువు, కోకాపేట్ నుంచి హైటెక్ సిటీ వరకు నడుస్తాయని అధికారులు వివరించారు.

ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 24 ట్రిప్పులతో ఈ బస్సులు ఐటీ ఉద్యోగులను సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుస్తాయని అధికారులు తెలిపారు. ఐటీ కారిడార్‌లో ఈ ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రావడానికి ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం.విజయ్‌కుమార్, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సహకరించారని అధికారులు చెప్పారు.

Related posts