సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, ఎస్సీఎస్సీ ప్రతినిధులతో కలిసి ఐటీ కారిడార్లో ఉద్యోగుల కోసం రెండు ఆర్టీసీ బస్సు సర్వీసుల సేవలను ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసులు కోకాపేట్ నుంచి పటాన్చెరువు, కోకాపేట్ నుంచి హైటెక్ సిటీ వరకు నడుస్తాయని అధికారులు వివరించారు.
ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 24 ట్రిప్పులతో ఈ బస్సులు ఐటీ ఉద్యోగులను సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుస్తాయని అధికారులు తెలిపారు. ఐటీ కారిడార్లో ఈ ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రావడానికి ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం.విజయ్కుమార్, ఎస్సీఎస్సీ ప్రతినిధులు, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సహకరించారని అధికారులు చెప్పారు.
వాలంటీర్ల అరాచాకాలు ముఖ్యమంత్రికి కనిపించటం లేదా? – బండారు శ్రావణి