telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ కుటుంబంలో విషాదం

ఏబీన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేమూరి కనకదుర్గ.. ఇవాళ మృతి చెందారు. గుండె పోటు రావడంతో అపోలో లో చికిత్స పొందుతూ మృతి చెందారు వేమూరి కనకదుర్గ. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వేమూరి కనకదుర్గ మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ సంతాపం తెలిపారు. వేమూరి కనకదుర్గ సేవ భావం కలిగిన వ్యక్తి అని.. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ గా సంస్థ అభివృద్దికి.. ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేశారని చంద్రబాబు తెలిపారు. అటు “ఆంధ్ర‌జ్యోతి- ఏబీఎన్ సంస్థ‌ల ఎమ్‌.డి.. జ‌ర్న‌లిస్ట్.. సంపాద‌కులు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి సతీమ‌ణి శ్రీ‌మ‌తి క‌న‌క‌దుర్గ గారు తుదిశ్వాస విడిచార‌ని తెల‌సి దిగ్భ్రాంతికి లోన‌య్యాను. జీవిత భాగస్వామికి నిజమైన నిర్వచనంగా మీ ప్రతి అడుగులో అడుగైన కనకదుర్గ గారి అకాల మరణ వార్త  నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దుఃఖ సమయంలో మీరు తట్టుకొనే శక్తి ని ఆ భాగవతుడు ప్రసాదించాలని  కోరుకుంటున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ, మీ  కుటుంబమంత‌టికీ నా సంతాపం తెలియజేసుకుంటున్నాను.”  అంటూ చిరంజీ పేర్కొన్నారు. 

Related posts