telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి పుష్ప శ్రీవాణి ఇంటి అద్దె రూ. లక్ష.. మంజూరు చేసిన ఏపీ సర్కార్

pushpa sreevani

ఏపీ గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఇంటి అద్దెను ప్రభుత్వం గురువారం మంజూరు చేసింది. మంత్రి అయిన తర్వాత పుష్పశ్రీవాణి విజయవాడలోని వివేకానంద కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

ఆ ఇంటికి నెలకు లక్ష రూపాయల అద్దెతో పాటు, క్యాంపు కార్యాలయ అలవెన్సుగా మరో రూ. 5 వేలను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి వివాహం తర్వాత విజయనగరం జిల్లా జియమ్మవలస మండలంలోని చినమేరంగి కోటలో స్థిరపడ్డారు.

Related posts