రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ది చేకూరుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 77 లక్షల మంది ఎస్సీలకు రూ.15.7 వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. అధెవిధంగా 25 లక్షల మంది ఎస్టీలకు రూ.5 వేల కోట్లకు పైగా పథకాలు వర్తింపజేస్తున్నారని వివరించారు.
వచ్చే ఏప్రిల్ 14 నాటికి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ పార్కు సిద్ధమవుతుందని వెల్లడించారు. ఈసారి ఆ మహనీయుని జయంతి వేడుకలౌ అక్కడే జరుపుకుందామని విజయసాయి పిలుపునిచ్చారు.