రాష్ట్ర రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించింది. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే కనుక మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
రాజధానుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజు పెరిగిపోతున్న తరుణంలో రాజధానుల విషయం ఇప్పుడు అవసరమా? అని విమర్శలు గుప్పిస్తున్నాయి.