telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మంత్రివర్యులు వీరే.. గవర్నర్ చేతికి జాబితా.. : జగన్

jagan meet governor today

ఏపీ సీఎం జగన్ నేడు గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. శనివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి పేర్లను గవర్నర్‌కు ముఖ్యమంత్రి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో 20 మంది మంత్రులు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. శుక్రవారం జరిగిన వైసీపీఎల్పీ సమావేశంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. కాగా ఇప్పటికీ ఆ 25 మంది మంత్రులు ఎవరు..? మంత్రులుగా అవకాశం ఎవరికి దక్కింది..? అనే విషయంలో వైసీపీ అధిష్టానం ఎక్కడా లీకులు కాకుండా చూసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ మంత్రులుగా ఖరారైన వారికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కొక్కరికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు. శనివారం ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా చెబుతున్నారు.

రేపు ఉదయం 11.49 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ ఏర్పాట్లను పోలీస్‌ ఉన్నతాధికారులు పరిశీలించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. సెక్రటేరియట్‌ మొదటి బ్లాక్‌లో జగన్‌ కార్యాలయం ఉంది.

Related posts