జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లో ర్యాలీలు, ప్రదర్శనలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
అన్ని ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కశ్మీర్ ఉద్రిక్త పరిస్థితులపై జనరల్ అలర్ట్స్ ఉన్నాయని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ వివరించారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.