పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సక్సెస్ఫుల్గా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచి రూ.75 కోట్ల గ్రాస్ను సాధించింది. అయితే ఇటీవల మహేష్ హిట్లు ఉన్నప్పుడే సినిమాలు చేస్తాడని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు సూపర్ స్టార్ అభిమానులకు కోపం తెప్పించాయి. దీంతో వారు పూరీని `ఇస్మార్ట్ శంకర్` సినిమాను టార్గెట్ చేశారు. అయితే హీరో రామ్, మహేష్ కలిసి మాట్లాడుకుంటున్నట్టున్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్మార్ట్ గెటప్లో ఉన్న రామ్, మహేష్ మధ్య సమావేశం జరిగింది. అయితే రామ్, మహేష్ దేని గురించి మాట్లాడుకున్నారో మాత్రం బయటకు రాలేదు. చాలా రోజులుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న డైరెక్టర్ పూరీ, హీరో రామ్కు “ఇస్మార్ట్ శంకర్” విజయం బూస్ట్ ఇచ్చింది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించారు. అయితే పూరీతో కలిసి “పోకిరి”, “బిజినెస్మేన్” వంటి సినిమాలు చేసిన సూపర్స్టార్ మహేష్ మాత్రం స్పందించలేదు.
previous post
next post