మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహ నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సోమవారం హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు పాల్గొని కాబోయే వధువరులను ఆశీర్వదించారు. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. కాబోయే వధూవరులకు అభినందనలు తెలిపారు
ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలనుంచి భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని నూతన జంటకు అభినందనలు తెలిపారు. వీరితోపాటు నటులు కైకాల సత్యనారయణ, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ఎస్.గోపాల్రెడ్డి, రమేశ్వర్మ, సంగీత దర్శకులు కోటి, టాలీవుడ్ రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
సెక్రటేరియట్కు మరో 70 ఏళ్ల పాటు ఢోకా లేదు: వీహెచ్