telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైట్ రైట్.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

rtc protest started with arrest

తెలంగాణలో శుక్రవారం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. 55 రోజుల సమ్మె తరువాత కార్మికులు తమ విధులకు హాజరయ్యారు. ఎటువంటి షరతులు లేకుండా తిరిగి విధుల్లో చేరాలని నిన్న రాత్రి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెల్లవారుజాము నుంచే డిపోల వద్ద బారులు తీరారు. విధుల్లో చేరి తమ బస్సులను బస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. నిత్యమూ ఫస్ట్ బస్ లను బయటకు తీసేవారు 3.30 గంటల సమయంలోనే డిపోలకు చేరుకోవడం గమనార్హం.

55 రోజులుగా బారికేడ్లు, పోలీసు పహారా మధ్య ఉన్న ఆర్టీసీ డిపోలు నేడు కార్మికులతో సందడిగా మారాయి. వీధుల్లో చేరేందుకు ఉదయం నుంచే కార్మికులు బారులు తీరారు. ఆర్టీసీ బస్సులు నడవడంతో ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు వీధుల్లో చేరడంతో ఇక ప్రయాణీకుల ఇక్కట్లు తొలగిపోనున్నాయి.

ఇక దాదాపు రెండు నెలలుగా మూతబడిన టీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ రిజర్వేషన్ వెబ్ సైట్ ను నేడు తిరిగి తెరవనున్నామని అధికారులు వెల్లడించారు. సమ్మెలో పాల్గొన్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులూ తిరిగి నేడు విధుల్లో చేరనుండటంతో, ఆర్టీసీ బస్సులు నేటి నుంచే పూర్తి స్థాయిలో తిరగనున్నాయి.

Related posts