telugu navyamedia
క్రీడలు వార్తలు

అర్ధశతకం పూర్తి చేసిన స్టోక్స్ ఔట్…

మేతేరా వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ను అక్షర్, సిరాజ్ కలిసి కష్టాలో పడేస్తున్నారు. వరుస ఓవర్లలో ఓపెనర్లను ఇద్దర్ని వెనక్కి పంపిన అక్షర్ పటేల్ ఆ జట్టును మొదట దెబ్బ తీసాడు. ఆ తర్వాత కెప్టెన్ రూట్ ను సిరాజ్ ఔట్ చేయడంతో 30 పరుగులకే మూడు విక్టకోల్పోయింది. కానీ ఆ తర్వాత లంచ్ బ్రేక్ వరకు మరో వికెట్ పడకుండా స్టోక్స్(24) అలాగే బెయిర్‌స్టో(28) జాగ్రత్తగా ఆడుతూ మొదటి సెషన్ ను పూర్తి అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 74/3 తో నిలిచింది. కానీ మళ్ళీ రెండో సెషన్ ప్రారంభమైన కొద్దీ సమయానికే సిరాజ్ తన ఖాతాలో రెండో వికెట్ వేసుకున్నాడు. జానీ బెయిర్‌స్టో(28) ఔట్ పెవిలియన్ చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత కూడా నిలకడగా ఆడి అర్ధశతకం పూర్తి చేసిన స్టోక్స్(55) ను సుందర్ ఔట్ చేసి ఈ మ్యాచ్ లో మొదటి వికెట్ తీసాడు. దాంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ 135/5 తో నిలిచింది. ఇక ప్రస్తుతం డేనియల్ లారెన్స్, ఆలీ పోప్ తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు.

Related posts