టీమిండియా టెస్ట్ క్రికెటర్, హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి తనపై చేసే ట్రోలింగ్కు చాలాదూరం ఉంటాడు. కానీ తాజాగా ఓ నెటిజన్ చేసిన విమర్శకు దిమ్మదిరిగే సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. అయితే కరోనాతో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొనేందుకు సోషల్ మీడియా వేదికగా విరాళాల సేకరణ చేపట్టాడు విహారి. హనుమ విహారి చేస్తున్న గొప్ప పనిని ప్రశంసించకుండా ఒక వ్యక్తి సెటైర్ వేశాడు. ‘సరే భాయ్, రెండు మసాలా దోసెలు తీసుకురండి. అలాగే కొబ్బరి పచ్చడి మర్చిపోవద్దు’ అంటూ విహరికి ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. సహజంగా తెలుగు క్రికెటర్ అయిన విహారి ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. కానీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అతడికి గట్టి జవాబు ఇవ్వాలనుకున్నాడు. ‘భారత దేశంలోని చాలా మంది లాగే నువ్వూ బాధపడుతుంటే.. నేను కచ్చితంగా ఇచ్చేవాడినే. ఓహ్.. ఒక్క నిమిషం. కానీ నిజానికి నువ్వు మరో రోగంతో బాధపడుతున్నావు. ఐయామ్ సారీ.. నీకు హెల్ప్ చేయలేను’ అని విహారి బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. 27 ఏళ్ల హనుమ విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు.
previous post