తోలు తీస్తామని వైసీపీ ఎంపీలు నిన్న చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు. తన ఒంటిపై చేయి పడితే కాపాడేందుకు హేమాహేమీలు ఉన్నారని చెప్పారు.
తోలు తీయడం తన వృత్తి కాదని, ప్రజలు అసహ్యించుకునేలా తాను మాట్లాడలేనని అన్నారు. తోలు తీసే చేష్టలకు సమాధానం చెప్పే స్నేహితులు తనకున్నారని చెప్పారు.ఎంపీ రాజుభయ్యా తనకు మంచి స్నేహితుడని చెప్పారు.
రాజూభయ్యానే కాదు తనను కంటికి రెప్పలా కాపాడేవారు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారని తెలిపారు. రాయలసీమలో, పులివెందులలో కూడా తనకు స్నేహితులు ఉన్నారని తెలిపారు. పది వేల మందితో పులివెందులలో సభ పెట్టే సత్తా తనకుందని చెప్పారు.